వస్తున్నా మీకోసం అంటూ టీడీసీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర ముగింపు తేదీ ఖరారైంది. ఏప్రిల్ 19 న విశాఖ జిల్లాలో తన పాదయాత్రను ముగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్ 19 నాటికి చంద్రబాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుటుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జిల్లా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కూడా విశాఖలోనే జరుపుకుంటారు. అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు పార్టీ పటిష్టతపై దృష్టిపెడతారు. పార్టీ విభాగాల పనితీరు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పాదయాత్రలో మిగిలిపోయిన జిల్లాల్లో చంద్రబాబు బస్సు యాత్ర చేస్తారు.  అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన బాబు ఇప్పటివరకు దాదాపు 2,400 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ ఇరవైనాటికి బాబుయాత్ర 3వేల కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: