హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగురోజుల కిందట అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్వి మిస్టరీ వీడింది. శ్రాగ్వి క్షేమంగానే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఈరోజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు చిన్నారిని మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. శ్రాగ్వి అపహరణకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా రు. అయితే, కుటుంబ కలహాల కారణంగా బంధువులే శ్రాగ్విని మాయం చేశారని పోలీసులు చెబుతున్నారు. కాగా, శ్రాగ్వి ఆచూకీ విషయాన్ని పోలీసులు ముందుగా కుటుంబానికి చెప్పకుండా మీడియాకు వెల్లడించడంపై తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తను తాము నమ్మలేయమన్నారు.  హైదరాబాద్ అంబర్ పేట శివంరోడ్డులో నాలుగు రోజుల కిందట రాత్రి సమయంలో 8 నెలల శ్రాగ్విని తల్లి ఎత్తుకొని వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు వాహనంపై వచ్చి చిన్నారిని బలవంతంగా కిడ్నాప్ గురయిన విషయం విదితమే. పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని శోధించారు. ఎట్టకేలకు శ్రాగ్వి క్షమంగా దొరగడంతో తల్లిదండ్రులకు ఈ రోజు మధ్యాహ్నం మీడియా ముందు అప్పగించారు. రెడ్డీస్ ల్యాబ్ లో పనిచేస్తున్న రావుల భరత్ కిడ్నాపుకు పాల్పడినట్లు గుర్తించామని కిడ్నాప్ గల కారణాలపై నిందితుడిని విచారిస్తున్నామని అనురాగ్ శర్మ వెల్లడించారు. తమ చిన్నారి శ్రాగ్వి క్షేమంగా దొరకడంతో చిన్నారి ఆచూకి కనుగొన్న పోలీసులకు, మీడియా మిత్రులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: