కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైదరాబాద్ నగరంలోని మల్కాజగిరి 10వ మెట్రోపాలిటన్ కోర్టు కుషాయిగూడ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్ కు చెందిన సతీష్ అగర్వాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతూ, విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని పేర్కొంటూ జనవరి 23న మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్ స్వీకరించిన కోర్టు సోమవారం సోనియాగాంధీపై ఐపిసి సెక్షన్ 420,120బి కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: