భారత దేశంలో రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  కామంతో కళ్లు మూసుకు పోయిన కొంతమంది చిన్నా పేద్దా అనే తేడా లేకుండా ఆడది అంటే చాలు చిత్తకార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు.  ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం కేవలం మనకు విద్యాబుద్దులు నేర్పించే గురువుకే ఇస్తాం. అలాంటి గురువులు కీచకుల్లా మరిపోయారు...బాలికపై సామూహిక అత్యాచారం చేసి గురువు స్థానానికే మచ్చ తెచ్చారు.   ఈ ఘటన బిహార్‌లోని జెహానాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
Image result for gang rape images
పాఠశాల భవనంలో ఒంటరిగా ఉన్న బాలికపై కాకోసెకండరీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అజూ అహ్మద్‌తోపాటు అతుల్‌ రహ్మాన్, అబ్దుల్‌ బరీ, ఎం.డి.శాకౌత్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్‌ అధికారి పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. అక్కడ అచేతన స్థితిలో ఉన్న బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలి తల్లి గమనించింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Image result for gang rape images
సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయులే ఇంత అమానవీయంగా, మృగాళ్లలా వ్యవహరించిన ఘటన జెహనాబాద్‌లో పెద్ద కలకం సృష్టిస్తుంది.  స్కూల్ బిల్డింగ్ పైకి తీసుకెళ్లిన వీరు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పీకే శ్రీవాస్తవ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: