గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీవ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ పోలీసులకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు.  ఈ పాటికే దేశంలోని ముఖ్యనగరాల్లో స్లీపర్ సెల్స్ రక్కీ నిర్వహించినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ దాడుల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐ ఎస్ ఐ తో పాటూ,మరో ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ల సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ మేరకు మన ఆర్మీ విభాగాల నుండి నిఘాసంస్థలకు సమాచారం అందింది.

గత సంవత్సరం  పఠాన్ కోట్ దాడులను మించి పోయేలా ఉండాలని ప్లాన్ చేస్తుందట ఆ సంస్థ.ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం అన్ని నగరాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.  పోలీసులతో పాటు సాదారణ పౌరులుకూడా అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో పాటూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: