అవును.. ఓ వైసీపీ ఎమ్మెల్యే కనిపించడం లేదు..ఇది ఓ టీడీపీ ఎమ్మెల్సీ ఆవేదన. వైసీపీ ఎమ్మెల్యే కనిపించకపోతే.. టీడీపీ ఎమ్మెల్సీకి ఎందుకు అంత ఆవేదన అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు కిటుకు. టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్యే కోసం వెదుకుతున్నది అతనిపై ప్రేమతో కాదు.. అతన్ని నలుగురిలోనూ పలుచన చేయాలని..
అసలు విషయానికి వస్తే.. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికీ, టీడీపీ ఎమ్మెల్సీ చంద్రమోహన్ రెడ్డికీ ఉన్న వైరం తెలిసిందే. ఆ మధ్య సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులన్నాయని కాకాని ఆరోపించారు. నిరూపించలేకపోయారు. అంతే కాదు.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన కేసులో ఇరుకున్నారు. అప్పటి నుంచి కాకాని పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు.
దీంతో సోమిరెడ్డి రెచ్చిపోతున్నారు. ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఈ నెల 14 నుంచి కనపడటం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. తనపై చేసిన అక్రమాస్థులతోపాటూ స్థలాల కబ్జా, నకిలీ మద్యం కేసులు కాకాణిపై నమోదై ఉన్నాయని నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి తెలిపారు.
తనపై చేసిన అక్రమాస్థుల కేసుకు సంబందించి గత నెల ఏడోవ తేది నుంచి ఈ నెల 13వ తేది వరకు కాకాణి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతాకాలు పెట్టారని చెప్పారు. ముందస్తు బెయిల్కు జిల్లా కోర్టు కాకాణి దరఖాస్తు చేసుకున్నా కోర్టు అంగీకరించలేదన్నారు. కాకాణిని నాలుగోవ అదనపు న్యాయమూర్తి వద్ద సరెండ్ కావాలని కోర్టు ఆదేశించడంతో అప్పటి నుంచి కాకాణి కనపడటం లేదని చెప్పారు.