మొండివైఖరి తో వ్య‌వహ‌రిస్తే ప్రతిసారీ వర్కఔట్‌ అవుతుందనుకుంటే అది భ్రమే. ఎంత పెద్ద నాయ‌కులు కైనా  కొన్ని సందర్భాల్లో  భారీ నష్టాన్నే క‌లిగిస్తుంది. తాజాగా ఇదే ప‌రిస్థితి ఏపీ సీఎం చంద్రబాబ నాయుడు కు ఎదుర య్యే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తరువాత... ఇప్పటి దాకా ఆయ న మొండి వైఖరినే అవలంబిస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప రాష్ట్రంలో మరో పార్టీ అస్తిత్వం అం టూ కీలకంగా లేకపోవడంతో.. చంద్రబాబు ఆటలు చెల్లుబాటు అవుతూ వచ్చాయి. ఆయన నిర్ణయాలు తమకు గిట్టకపోయినప్పటికీ వైకాపాలోకి వెళ్లే పరిస్థితి లేని తెదేపా నేతలు నోరుమూసుకుని ఉండే పరిస్థితి ఇన్నాళ్లూ ఉండేది. 

అయితే ఇప్పుడు మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చంద్రబాబు ఇంకా మొండిగా వ్యవహరిస్తే పార్టీకి దెబ్బ పడుతుందేమో అని పలువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం, మంత్రి వర్గ విస్తరణ పర్వం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి పొంచి ఉన్న ప్రమాదాలు కూడా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. సహజంగానే ఉన్న అవకాశాలకంటె ఆశించే నాయకుల సంఖ్య ప్రతిసారీ పెరుగుతూ వ‌స్తోంది. అయితే నాయ కుడుగా ఉన్న వ్యక్తి.. ఎవరినీ నొప్పించకుండా తానోప్ప‌క ఒప్పించుకు తిరుగుతూ పరిస్థితులు చక్కబెట్టుకుంటూ పోవాలి. కానీ... చంద్రబాబు వైఖరి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. 

తమకు ఎమ్మెల్సీలుగా అవకాశ కల్పించమంటూ వస్తున్న నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు, పెడస రంగా స్పందించడం, వారి సీనియారిటీని కనీసంగా కూడా పట్టించుకోకుండా చులకనగా మాట్లాడడం ఇలాంటి మొండి వైఖ‌రి పార్టీకి చేటు చేస్తాయేమోనని పలువురు అనుకుంటున్నారు. ఇటీవల నెల్లూరుకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడును పర్సనల్ గా కలిసి, పెడ మొహం పెట్టుకుని వెళ్లారు. తనకు టిక్కెట్ అడిగితే ఎవరికి ఏమివ్వాలో నాకు తెలుసు అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా సమాధానం చెప్పినట్లు వార్తలు బయటకు వచ్చాయి. 

కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ఆనం సోదరుడు, ఇక్కడి ట్రీట్‌మెంట్ పరాభవానికి ఖంగుతిన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం సీనియర్ నాయకుడు కరణం బలరాం కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని అనుచరులు కోరినప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో నాకు తెలు సు అంటూ చంద్రబాబు రంకెలేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమకు టిక్కెట్ కావాలంటూ పార్టీ అధినేతకు విన్నవించుకోవడం కూడా తప్పేనా, ఆ మాత్రం దానికి ఇలా రంకెలేయాలా అంటూ పార్టీ శ్రేణులు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బహిరంగంగా ఈ రెండు దృష్టాంతాలు తెలిశాయి గానీ.. వాస్తవానికి మంత్రి పదవులకోసం, ప్రధానంగా ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం పైరవీలు చేసుకుంటున్న పలువురికి ఇలాంటి పెడసరపు సమాధానాలే ఎదురవుతున్నాయిట. రాష్ట్ర‌ విభజనకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉండి.. లోక్ సభలో సమైక్యాంధ్ర గళం విని పించడం లో ముందు నిలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్ప టికీ ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా.. తన మాట చెల్లుబాటు కాకుండా నిత్య అవమానాలతో టీడీపీలో ఉండలేక ఉంటున్నారట. 

దీంతో విసిగిపోయిన మోదుగుల పార్టీని వీడడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనే ఉనికికోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి రావడంతో మోదుగుల వేణు గోపాల్ రెడ్డిని పక్కనపెట్టి రాయపాటికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని నచ్చజెప్పి మోదుగులను గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. 

అయితే మోదుగులకు మంత్రి పదవి రాకపోగా  సొంత నియోజకవర్గంలోనూ ఆయనపై ఇతర నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇవన్నీ ఆయన గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఏమీ ప్రయోజనం లేకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని టాక్. చంద్రబాబు అనుసరిస్తున్న ఇలాంటి మోనార్క్ ధోరణులు పార్టీ శ్రేణు ల్లో అసంతృప్తిని ఏ అంచులకు తీసుకువెళతాయోనని, పార్టీకి ఎలాంటి చేటు జరుగుతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: