గత కొన్ని రోజులుగా నిశ్శబ్ధంగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పడగవిప్పారు.  ఈ రోజు ఉదయం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) జవాన్లపై మావోయిస్టులు ఆకస్మికదాడికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా బెజ్జి ప్రాంతంలో  సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 11 మంది జవాన్లు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  మరణించిన జవాన్ల దగ్గర నుంచి ఆయుధాలు, రేడియో సెట్లను మావోయిస్టులు అపహరించుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పులు ప్రస్తుతం ముగిసినట్లు తెలుస్తోంది.
మావోయిస్టుల భారీ ఎటాక్: 11 మంది జవాన్ల మృతి!
ఐఈడీ అమర్చి, దాన్ని పేల్చడంతో పాటు ఆ షాక్‌లో ఉన్న జవాన్లను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు.. ఒక్కసారిగా విరుచుకుపడి జవాన్లను హతమార్చారు. కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల మీదకు కాల్పులు జరిపారు.  
Image result for maoists-in-sukma
ఫిబ్రవరి మొదటివారంలో ఛత్తీస్‌గఢ్‌లోనే నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. అది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా అప్పట్లో భావించారు.  అప్పటినుంచి ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తున్న మావోయిస్టులు..జవాన్లపై విరుచుకుపడ్డారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image result for maoists-in-sukma

మృతుల వివరాలు :
ఇన్‌స్పెక్టర్ జగ్జీత్ సింగ్, ఏఎస్ఐ హెచ్‌బీ భట్, ఏఎస్ఐ నరేందర్ కుమార్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ పీఆర్ మిండే, కానిస్టేబుల్ మంగేష్ పాల్ పాండే, కానిస్టేబుల్ రాంపాల్ సింగ్ యాదవ్, కానిస్టేబుల్ గోరక్‌నాథ్, కానిస్టేబుల్ నందకుమార్ పాత్రా, కానిస్టేబుల్ సతీష్ కుమార్ వర్మ, కానిస్టేబుల్ కె. శంకర్, కానిస్టేబుల్ సురేష్ కుమార్


క్షతగాత్రులు వీరే :
హెడ్‌ కానిస్టేబుల్ జగదీష్ ప్రసాద్‌ విష్ణోయ్ (పరిస్థితి విషమం), కానిస్టేబుల్ జైదేవ్ ప్రామాణిక్, కానిస్టేబుల్ సలీం



మరింత సమాచారం తెలుసుకోండి: