కేసీఆర్ కు ఇటీవల యాదవులపై అపరితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రతి యాదవ కుటుంబానికి నాలుగు గొర్రెలు కొని ఇచ్చేలా పథకం రూపొందిస్తున్నారు. కేసీఆర్ ఐడియా ప్రకారం.. రెండు మూడేళ్లలో ప్రతి యాదవ కుటుంబం దగ్గరా 20 గొర్రెలు ఉంటాయని.. దాంతో.. ఇక తెలంగాణలో యాదవులంతా శ్రీమంతులైపోతారని కేసీఆర్ చెబుతున్నారు.
కేసీఆర్ గొర్రెల పథకంపై పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. కేసీఆర్ పథకాన్ని ఓట్లు కొల్లగొట్టే చర్యగా భావిస్తున్నవారు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. అలాంటి వాటిలో ఇదీ ఒకటి..
" 20 గొర్లకు శ్రీమంతులు, కోటీశ్వరులు ఐతే 100 ల గోర్లను పెంచుతున్న వాళ్ళు ఖచ్చితంగా త్వరలో బిల్ గేట్స్ ను మించిపోబుతున్నారు. ఈ దేశంలో నే కాదు కాదు ప్రపంచంలోకెల్లా గోర్లను కాసేవాళ్ళే ధనవంతులు కాబోతున్నారు. "
" ఈ ప్రపంచమే మనకు దాసోహం కానుంది. కెసిఆర్ , మోడీ లు మనకు రోజు పూజలు, పాలాభిషేకాలు చేస్తారు. రోజు మన గొర్ల దొడ్ల ముందుకు వచ్చి మనలను డబ్బు ఇవ్వమని ప్రాధేయపడుతారు. ఔను ఇది నిజమే కాదు జోక్ అనుకుంటున్నారా మీకు ఇంకా అనుమానంగా ఉంటే పాలాభిషేకాలు చేసేవాళ్లను అడగండి వాళ్ళు చెప్తారు."
"మిమ్మల్ని కెసిఆర్ ఎట్లా ధనవంతులను చేస్తాడో అలాగే 100ల సంవత్సరాలనుండి గొర్లకాస్తున్నవాళ్ళు ఎందుకు పేదోళ్లు గా వున్నారో చెప్పి మీ మూసుకుపోయిన కళ్ళను తెరిపించి మీకు జ్ఞానోదయం చేస్తారు. ఔను గా ధనవంతులను, శ్రీమంతులను, కోటీశ్వరులను మనల్ని చేసి గా చిన్న తుచ్ఛమైన సీఎం పదవి మాత్రమే కెసిఆర్ ఎందుకు వుంచుకుంటున్నాడో నాకు తెలవదు. పూర్ ఫెలో పాపం ఈ ప్రపంచంలో ఈ అమాయక కెసిఆర్ అయన కుటుంభం ఎలా బతుకుతారో కదా. "