రోజా.. వైసీపీలో ప్రముఖ నాయకురాలు.. రోజా.. ఓ సినీ నటి.. రోజా.. టీవీ యాంకర్ కమ్ జడ్జి.. ఇలా రెండు, మూడు పాత్రలు  అవలీలగా పోషిస్తున్న నటి రోజాపై అధికార పక్షం విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రజా సేవ చేస్తానని ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన రోజా.. ఇప్పుడు తన సొంత నియోజకవర్గం ప్రజల కోసం ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. 


రోజా.. తన సొంత నియోజకవర్గం నగరిలో పెద్దగా పర్యటనలు చేయడం లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజాకు జబర్దస్త్, రచ్చబండ వంటి కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉంటున్నట్టున్నారని కామెంట్ చేసారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు అసెంబ్లీ లాబీల్లో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


టీవీల్లో కనిపిస్తేనే సరిపోతుందని రోజా భావిస్తున్నట్టున్నారని గాలి ముద్దుకృష్ణమనాయుడు సెటైర్ వేశారు. ఒక వేళ ఎప్పుడైనా దారి తప్పి నియోజకవర్గానికి వచ్చినా గొడవలు పెట్టుకుంటారని గాలి అంటున్నారు. పాపం రోజా చేతిలో పరాజయం పాలై రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రస్తుతం ప్రెస్ మీట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. 


రోజాపై గెలిచి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా ఉండేది. పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రి పదవో లేదా మరేదైనా కీలకమైన పదవి లభించి ఉండేవి. పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికల్లో ఓడిపోవడం అనేది గాలి ముద్దుకృష్ణమకు మైనస్ గా మారింది. అందుకే రోజాపై ఆ మాత్రం అసహనం ఉండటంలో ఆశ్చర్యం ఏముంటుంది..!?



మరింత సమాచారం తెలుసుకోండి: