ఉత్తర్ ప్రదేశ్ లో మరోదారుణం చోటు చేసుకుంది.  ఈ మద్య అమ్మాయిలపై, మహిళలపై కొంత మంది కామాంధులు అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు..కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళా వార్డెన్ ఏకంగా 70 మంది అమ్మాయిలను నగ్నంగా నిలబెట్టి ఒక్కొక్కరినీ తనిఖీ చేసింది.  వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూలులో ఓ వార్డెన్ 70 మంది విద్యార్థునులను నగ్నంగా నిలబెట్టి అమానుషంగా తనిఖీలు చేయించింది. అందుకు నిరాకరించిన వారిని చితకబాది మరీ ఆ పని చేసింది.  
girls
ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తరుపు తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపట్ల బాధిత విద్యార్థులు కూడా మీడియావద్ద బోరుమంటూ ఆ వార్డెన్‌ తమపై చేయి చేసుకుందని, బట్టలు విప్పేయకుంటే చావు దెబ్బలు తప్పవంటూ హెచ్చరించిందంటూ ఏడ్చేశారు.   పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వార్డెన్లకు కూడా పిల్లల విషయంలో ఎలా మసలుకోవాలన్నదానిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. ఇపుడలాంటివి వున్నా... ఏదో మొక్కుబడిగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. అందువలనే పిల్లలపై మానసిక, భౌతిక దాడులు ఎక్కువవుతున్నాయనిపిస్తోంది.
Image result for muzaffarnagar warden girls
వార్డెన్ మాత్రం తనును తాను సమర్ధించుకుంటుంది..హాస్టల్ బాత్రూమ్‌లో ఓ చోట ఆమెకు రక్తం మరకలు కన్పించాయట. దాంతో ఏ అమ్మాయికో ఇబ్బంది వుందని గ్రహించాననీ, అలా ఇబ్బందిపడే అమ్మాయి ఎవరో చెప్పమని అడిగితే ఎవ్వరూ చెప్పలేదట. దాంతో ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేందుకు ఇలా అందరి చేత దుస్తులు విప్పించేశానని సర్ది చెప్పుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించేందుకు రంగంలోకి దిగారు అధికారులు. మరోవైపు యాజమాన్యం ఆ మహిళా వార్డెన్‌ను పదవి నుంచి తొలగించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: