"రాజకీయం నరనరాన ప్రవహిస్తున్న దేహం" "నడిచే రాజకీయ నిఘంటువు". పదవిలో లేకుండానే రాజకీయాలు నడపటంలో దిట్ట. సమస్యని గెలకటం, తనకు అనుకూలంగా మార్చుకోవటములో అందెవేసిన చెయ్యి. మన జగన్ లాంటివాళ్ళకి రాజకీయాలంటే, ఆవేశం వచ్చీ రాగానే విరుచుకుపడటం. చంద్రబాబు లాంటి వాళ్ళకి ఆత్మస్తుతి పరనింద. కాని కొందరికి అలాకాదట సమయం చూసి, సందర్భం చూసి విరుచుకుపడాలట. అంటే సరైన సమయంలో కీలెరిగి వాత పెట్టటమన్న మాట.
ఇదేదో వచ్చీ రానీ రాజకీయం చేస్తున్న నేతలు చెబుతున్న మాట కాదు. రౌడీల రాజ్యంగా పేరుపడ్డ బీహార్ ను సుదీర్ఘ కాలం పాటు పాలించి. తాను పశువులు భొంచేసే పచ్చిగడ్డి కేసు లో ఇరుక్కొని చిక్కుకున్నా, చెరసాల్లో కూర్చోనే భార్య రబ్రిదేవి చేత పాలన సాగించిన రాజకీయ యోధాగ్రణి, "లాలూ ప్రసాద్ యాదవ్" చెబుతున్న మాట. దాణా కుంభ కోణంలో దోషిగా తేలిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలను నుంచి తప్పుకోని తప్పని వాతావరణం లో అస్త్ర సన్యాసం చేసిన యోధుడల్లే, మరో మారు జూలు విదిల్చి తన ఇద్దరు కుమారులను రాజకీయ రణక్షెత్ర బరిలోకి దింపారు. లాలూ ప్రసాద్ కుమారులు ఇద్దరిలో ఒకరు తేజస్వి ప్రసాద్ యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి ఉండగా, మరొకరు తేజ్ ప్రతాప్ యాదవ్ జలవనరుల మంత్రిగా అదే నితీశ్ కుమార్ కేబినెట్ లో ఉన్నారు.
ఇటీవలి కాలంలో కొడుకుల శాఖల్లో వేలు పెడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ పలు సందర్భాల్లో విమర్శలు కొని తెచ్చుకున్నారు. ఈ వైనంపై విపక్షాలు ఆయనపై విరుచు కుపడ్డాయి. బీజేపీ నేతలు సైతం లాలూ ప్రసాద్ వైఖరిపై నిప్పులు చెరిగారు. అయితే రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడిగా పేరున్న లాలూ యాదవ్ ఆ విమర్శలన్నింటి నీ చాలా ఓపిగ్గానే ఖాతర్ చేయకుండా భరించారు. రాజకీయ నాయకుడికి నీతి నిజాయతీయే కాదు సిగ్గు కూడా ఉండదని ఈయన అవకాశం వచ్చినప్పుడల్ల ఋజువు చేస్తారు. అవకాశం కోసం ఎదురు చూస్తారు కూడా!
అనుకోకుండా ఆయనకు నోటిదూల వదిలించుకునే ఆ అవకాశం రానే వచ్చింది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసును విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 25 ఏళ్ల నాటి ఈ కేసును మరింత కాలం పాటు కొనసాగించడానికి వీలులేదని, ఈ క్రమంలో ఈ కేసుపై ప్రతి రోజు విచారణ సాగేలా చూస్తామంటూ తన నిర్ణయాన్ని స్పష్టీకరించింది.
అంతేకాకుండా నాడు మసీదు విధ్వంసానికి పాల్పడిన కరసేవకులకు అండ దండగా వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా మసీదు కూల్చివేతకు పక్కా ప్రణాళిక రచించినట్లుగా భావిస్తున్న బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ, ఆయన సహచరుడు మురళీ మనోహన్ జోషి, ప్రస్తుత కేంద్ర మంత్రి ఉమా భారతి తో కలిపి 12 మందిపై అభియోగాలు నమోదు చేసి విచారణ వేగవంతంగా జరపాలని రోజువారీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంకేం రాజకీయభోజనునికి పనిలేదు రాష్ట్రం లో మాట్లాడితే విపక్షాలు తన్ని తరిమేస్తున్నాయి మొన్న ఉత్తరప్రదేశ్ రాజకీయా ల్లో దూరి కొంత పరువు పోగొట్టుకున్న లాలుకు వార్తల్లో వ్యక్తిగా మారాలనుకున్నాడేమో - సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు విన్న వెంటనే రంగంలోకి దిగి, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ పడ కుండా లాల్ కృష్ణ అద్వానీ పై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేశారని ఆరోపించారు.
లాలు దూల
ఇందులో భాగంగానే బాబ్రీ మసీదు కేసును తిరగదోడారని అన్నారు. "సీబీఐ, ప్రధాని చెప్పుచేతుల్లో ఉంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో అద్వానీకి వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించింది. ఈసారి అద్వానీ రాష్ట్రపతి అవుతారని ప్రచారం జరుగుతోంది. అద్వానీ అవకాశాలకు ప్రధాని మోదీ గండికొట్టారు. రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం రాజకీయకుట్ర చేసిందని ఎవరైనా అర్థం చేసుకోగలరు" అని 'జాతి అంతా అలా అంటున్నట్టు'గా లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు. "2002 గుజరాత్ అలర్ల సమయంలో తనను అద్వాణీ కాపాడారన్న కనీస విశ్వాసం కూడా మోదీకి లేదని లాలూ ఆక్షేపించారు"
సీబీఐ, ప్రధాని చెప్పుచేతుల్లో ఉంటుంది. కాని లాలు అనుకున్నట్లుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కాకపోవచ్చు కదా! ఆ మాట అంటే ఏమౌతుందో లాలు ప్రసాద్ యాదవ్ కు తెలుసు "పశు దాణా మేసి జైలు లో చిప్ప కూడు తిన్న వాళ్ళు" అంత కంటే ఏం మాట్లాడగలరని బిహార్ విపక్షం నెత్తీ నోరు బాదుకుంటున్నారు.
ఈ సంధర్భంగా ఇందిరాగాంధి అనే ఒక మాట గుర్తుకు వస్తుంది. "చెన్నారెడ్డిని జనంలో, సంజీవరెడ్డిని పదవిలో ఉంచకూడని" అలాగే లాలూని "జైల్లో ఉంచితేనే బెటర్, ఖాళీగా బయట తిరగనిచ్చేకన్నా" దీనికి మోదీ గారు ఏమంటారో! ఆయన చేతుల్లోనే సిబిఐ ఉందికదా Rs. 30.00 కోట్ల భూదందా, తన ఇద్దరు కొడుకులు తన ధర్మ పత్ని తాను కలసి చేసిన "లార" (లాలు రబ్రి) స్కాం ఉండనే ఉంది దీని కోసం ఒక సారి సిబిఐ ని వాడేస్తే లాలు దూల కూడా తీరి పోద్ది — పని సరి - నితీష్ కుమార్ హాపీస్, అంటున్నారు బిహార్ ప్రజలు.