కొద్ది సేపట్లో పెళ్లి .. తాళి కట్టాల్సిన వరుడు నేను పెళ్ళే చేసుకోను అంటూ మొండికేసాడు. ఇదెక్కడి విడ్డూరం అంటూ అందరూ కంగారు పడ్డారు. అమ్మాయి నచ్చలేదా ? ఎవరినైనా ఇష్ట పడుతున్నావా ? కట్నం తగ్గందా? అంటూ రకరకాల ప్రశ్నలతో అతన్ని ఇబ్బంది పెట్టారు. కానీ అతని బాధ ఇదంతా కాదు అతనికి టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ని చూడాలని ఉంది, అతని సమక్షం లోనే పెళ్లి చేసుకోవాలని ఉంది.


సో చివరికి తన పంతం నేగ్గించుకుని ఆయన వచ్చే దాకా కూర్చున్నాడు. ముహూర్తం దాటిపోయినా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయి రేవంత్ అణా రావాలి అంటూ మొండికేసాడు.షాద్‌నగర్‌లో జరిగిందీ ఘటన. వేపంజర్ల గ్రామానికి చెందిన మహేశ్‌యాదవ్ తెలుగుదేశం పార్టీ అభిమాని. తెలంగాణ రేవంత్ సైన్యం (టీజీఆర్ఎస్)లో సభ్యుడు కూడా. 


అదే షాద్ నగర్ కి చెందిన యువతి తో ఇతని పెళ్లి ఫిక్స్ అయ్యింది. రేవంత్ రెడ్డి ని పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించాడు. పెళ్లి టైం కి రేవంత్ ఎదో ఇతర పనిలో ఉండడం వలన రాలేకపోయాడు వధువు మెడలో తాళి కట్టాలి అంటే రేవంత్ రావాల్సిందే అంటూ మహేష్ తేల్చి చెప్పడం తో టీజీఆర్ఎస్ అధ్యక్షుడు జయంత్, మరికొందరు నేతలు కలిసి వెంటనే హైదరాబాద్ వచ్చి రేవంత్‌రెడ్డిని కలిసి విషయం చెప్పారు. అప్పటికే చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన వారితో కలిసి షాద్‌నగర్ వచ్చారు. రేవంత్ ని చూసి ఆ ఆనందం లో పెళ్లి చేసుకున్నాడు ఈ అభిమాని.


మరింత సమాచారం తెలుసుకోండి: