యువతులు, మహిళలు కలుపుకొని దాదాపు 200 మందిని ఆడవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన ఆర్టీసీ కండక్టర్‌ కీచకవ్యవహారం విజయవాడలో సంచలనం రేపుతున్నది. దక్షిణ మండలం సహాయ కమిషనర్ కంచి శ్రీనివాసరావు కథనం ప్రకారం..విజయవాడ రూరల్ మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన పమిడిపాటి శ్రీనివాసరావు (39) గవర్నరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్. రూట్ నంబరు 48 (అజిత్‌సింగ్ నగర్) బస్సుకు రెగ్యులర్ కండెక్టర్ అయిన శ్రీనివాసరావుకు జులాయిగా తిరిగే పాస్టర్ కుమారుడు మార్లపూడి శామ్యూల్‌ (30)తో స్నేహం కుదిరింది. విద్యార్థినుల పాస్‌లను చెక్‌చేసే క్రమంలో శ్రీనివాసరావు వాటిపై ఉన్న వారి ఫోన్ నంబర్లను గుర్తుపెట్టుకుని రాసుకునేవాడు.


200 మంది అమ్మాయిల్ని చిత్రహింసలు పెట్టి..

రోడ్లపై, పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్‌ నెంబర్లను సేకరించి వారికి నరకం చూపించడం ఇతని నిత్యకృత్యం.ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కండక్టర్‌ పమిడిపాటి శ్రీనివాసరావును, అతని స్నేహితుడు మార్లపూడి శామ్యూల్‌ను సినీ ఫక్కీలో అరెస్టుచేశారు. ఇటీవల శ్రీనివాసరావు విధి నిర్వహణలో ఉండగా బస్సులో ఓ వ్యక్తి మూర్ఛ వచ్చి పడిపోయాడు. దీంతో ఆయన సెల్ తీసుకుని ఆయన కుమార్తెకు సమాచారం అందించాడు. పనిలో పనిగా ఆమె నంబరును రాసుకున్నాడు.



రెండు రోజుల తర్వాతి నుంచి ఆ అమ్మాయికి అసభ్య సందేశాలు వెల్లువెత్తాయి. రోజూ ఫోన్ చేసి నాన్నకు ఎలా ఉందంటూ పరామర్శించేవాడు. దీంతో అతడి తీరుపై అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు బయటపడింది. తమకందిన సమాచారం ప్రకారం 22వ తేదీన గవర్నర్‌పేట బస్‌ డిపో వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు, వారి నుంచి 5 సెల్‌ఫోన్‌లు, 3 సిమ్‌ కార్డులు, 9 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నిందితులలో ఒకరిని పమిడిపాటి శ్రీనివాసరావుగా గుర్తించినట్లు, అతను ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో యనమలకుదురులో నివసిస్తున్నట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: