ఈనాడు దిన పత్రిక టీడీపీ అనుకూలవైఖరి అవలంభిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తెలుగుదేశం పార్టీలో జరిగిన గొడవల కారణంగా ఒక వర్గంపై మరోవర్గం దాడి చేసుకుని ఇద్దరు చనిపోయిన వార్తను ఆ పత్రిక కవర్ చేసిన విధానం ఆశ్చర్యం కలిగించకమానదు. సదరు వార్తలో ఎక్కడా టీడీపీ అన్న పేరు రాయకుండానే వార్తను ముగించేశారు. 



ప్రకాశం జిల్లా టీడీపీలోవర్గపోరు పతాకస్థాయికి చేరింది. కరణం బలరామ్- గొట్టిపాటి రవి వర్గీయుల మధ్య ఎప్పటినుంచో కక్షలు ఉన్నాయి. వారు ఇద్దరూ ఎప్పుడూ రెండు పార్టీలో ఉండేవారు. గొట్టిపాటి రవిని వైసీపీ నుంచి టీడీపీకి ఇటీవల ఆకర్షించారు. దీంతో రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడాల్సి వస్తోంది. తాజాగా రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఇధ్దరు చనిపోయారు.  



అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరంలో బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేయగా, ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఈనాడు వార్త ఇస్తూ ఇది గొట్టిపాటి కరణం వర్గాల మద్య ఘర్షణగానే రాసింది. పాతకక్షల కారణంగా ఈ ఘర్షణ జరిగిందని రాశారు. కానీ ఎక్కడ తెలుగుదేశం ప్రస్తావన కానీ.. ఇద్దరూ టిడిపిలోనే ఉన్నారని కాని రాయలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: