భారత దేశంలో రోజు రోజుకీ రాజకీయాలు మరీ దిగజారిపోతున్నాయి అనడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి.  ఇప్పటికే నాయకులు ఒకరిపై ఒకరు దూషనలు, ఆరోపణలు చేసుకుంటూ ప్రతిరోజూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Image result for delhi assembly kapil mishra attack
 వివరాల్లోకి వెళితే..ఆమ్ ఆద్మీ రెబెల్ ఎమ్మెల్యే క‌పిల్ మిశ్రాను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసి బయటకు గెంటేశారు.  గత కొంత కాలంగా ఆప్ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరపాలని ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు.  

Image result for delhi assembly aap mlas attack

అంతే ఒక్కసారిగా ఆప్  ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది..తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తావా అంటూ ఊగిపోయారు...క‌పిల్ మిశ్రాల‌కు స‌భ‌లో వాగ్వాదం జ‌రిగింది.  దీంతో కమిల్ మిశ్రాను సస్పెండ్ చేశారు స్పీకర్. ఈ లోగా  లోగానే ఆప్ ఎమ్మెల్యేలు మిశ్రాపై దాడి చేశారు. అవినీతి ఆరోపణలపై చర్చిద్దామని సవాల్ చేస్తే.. కేజ్రీవాల్ ప్రభుత్వం దాడులకు దిగుతోందని కపిల్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: