భారత దేశంలో రోజు రోజుకీ మహిళలపై, చిన్నారులపై, యువతులపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.  ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆడవారిపై అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతూనే ఉన్నారు.  అలాంటి కామాంధులకు శిక్షలు సరైన విధంగా అమలు చేయకపోవడం ఒకకారణం అయితే.. ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ సౌకర్యం..అందులో అశ్లీల సంస్కృతి బాగా పెరిగిపోవడంతో యువత పెడదారి పడుతుంది.  ఇక ఇలాంటి వారిని శిక్షించే ఓ కానిస్టేబుల్ ఇద్దరు మైనర్ అమ్మాయిలతో అశ్లీలంగా ప్రవర్తించడం ఇప్పుడు పెద్ద సంచలనం అయ్యింది.  

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈశ్వరీ ప్రసాద్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ మంచంలో పడుకొని అక్కడే ఉన్న ఇద్దరు మైనర్లలో ఒకమ్మాయి చేయి పట్టుకొని తాకరాని చోట తాకుతూ..అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక నిరాకరించడంతో లైంగికంగా వేధింపులు చేసే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో  బయటకు రావడంతో అతడికి చిక్కులు వచ్చి పడ్డాయి.

కానిస్టేబుల్ మాత్రం  వారిని ఇంటికి వెళ్లాలని చెప్పేందుకే చేయిపట్టుకున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని  ప్రస్తుతానికి పోస్కో యాక్ట్‌ ప్రకారం ప్రసాద్‌పై కేసు నమోదు చేశామని, విచారణ చేస్తామని పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ రాజేశ్‌ ఎస్‌ తెలిపారు.  లైంగికంగా వేధించిన కానిస్టేబుల్, నిందితులపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: