భారత దేశం ఎంత ప్రగతి పథంలో ముందుకు సాగుతుందో..నేర సామ్రాజ్యం కూడా అంతే విస్తరిస్తుంది.  వంద రూపాయల కోసం కూడా ప్రాణాలు తీసే నీచులు ఈ దేశంలో రోజు రోజుకీ పుట్టుకు వస్తున్నారు.   ఇది కొంత మందికి జీవినోపాది..కాగా మరికొంత మంది తమ పేరు వింటే పది మంది భయపడాలి అని చేస్తున్న పనులు.  ఏది ఏమైనా కొన్ని నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.  

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని లక్నోకు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్‌లో ఓ వ్యాపారి కుటుంబంపై బుల్లెట్‌ వర్షం కురిపించారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.  వివరాల్లోకి వెళితే..వ్యాపారి సునీల్ జైస్వాల్(60)  తమ పని ముగించుకుని తన కొడుకు ఇంటికి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన కొంత మంది దుండగులు..జైస్వాల్ , అతని భార్య కామిని పై పాయింట్ బ్లాక్ లో గుండ్ల వర్షం కురిపించారు. \

అదే సమయానికి కొడుకు రితిక్ (25) బయటకు రావడంతో అతనిపై కూడా కాల్పులు జరిపారు.  పక్కింటి అతను జైస్వాల్ కుటుంబాన్ని కాపాడబోగా.. అతనిపై కూడా కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: