హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా భారీ వర్షం పడ్డం తో చాలా ప్రాంతాలు పూర్తిగా జల మాయం అయిపోయాయి. నగరం లోని హుస్సేన్ సాగర లోకి భారీగా వరద నీరు  చేరుకుంది. నిన్న మొన్నటి వరకు దాదాపు ఎండిపోయిన హుస్సేన్ సాగర్ ఇప్పుడు నిండు కుండలా ఉంది.


నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా, పంజాగుట్ట, ఉప్పల్, అంబర్ పేట రోడ్ నంబర్ 6, తాజ్ కృష్ణా జంక్షన్, అమీర్ పేట ఇమేజ్ ఆసుపత్రి, కేసీపీ జంక్షన్, బేగంపేట న్యూవే, నింబోలి అడ్డా, చింతల్ బస్తీ గోల్నాక, పుత్లీబౌలీ, సీబీఎస్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తున వర్షపు నీరు పారుతోంది.

 

పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: