తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.నిర్మల్‌ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన దేవన్న సచివాలయంలోని సి.బ్లాక్‌ ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి దేవన్న సచివాలయానికి వచ్చాడు.  
Devendra suicide attempt in front of C Block Telangana secretariat
గతంలో కూడా రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చినట్లు గా తెలుస్తుంది. అయితే దేవన్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.  గతంలో గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవాలని వచ్చాడు. అక్కడ సిబ్బంది సీఎం ని కలువనీవ్వక పోవడంతో సి బ్లాక్ ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

పోలీసులు సకాలంలో ఆయనను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడూ అన్న విషయం తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: