రెండు రోజుల క్రితం తిరుపతిలో అదృశ్యమైన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యమైంది. తిరుపతికి 15కి.మీ దూరంలోని కరకంబాడీ సమీపంలో స్థానికులు ఆయన్ను గుర్తించారు.తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పూర్వ బూర్గంపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కుంజా భిక్షం తిరుమలలో అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్లి మందిరం వెలుపలికి వస్తున్న సమయంలో ఆయన తప్పిపోయారు.

 గత కొంత కాలంగా ఆయన  మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను సోమవారం కరకంబాడి వద్ద గుర్తించారు.  

సీసీ కెమెరా పుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నప్రసాదం సముదాయం వద్దకు భిక్షం వెళ్లినట్టు కెమెరాలో కనిపించిందని పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా ఆహారం లేకపోవడం నీరసించిపోయిన ఆయనను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: