ఎన్డీయే అభ్యర్ధి రాం నాథ్ కోవింద్ హైదరబాద్ రావడం విషయం లో తెలుగు రాష్ట్రాల తెలుగు పార్టీలు చేసిన హడావిడి చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది. ఫ్లెక్సీ ల దగ్గర నుంచీ సత్కారాలూ బీజేపీ మీద భక్తి చాటుకోవడం లో ఒక్కొక్కరూ ఒక్కక్క ప్రయత్నం చేసారు . ఇదే అసలు ఆశ్చర్యం అంటే మరొక పక్క ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీరు వామ్మో అనిపిస్తోంది.


విజయ సాయి రెడ్డి   ఆయన కాళ్ళకి దండం పెట్టడం అందరూ వింతగా చూసారు. ఈ ప్రవర్తన ని ఎలా అర్ధం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు విశ్లేషకులు. భాజాపా అంటే ఎప్పటి నుంచో భయం , కొత్తగా వచ్చిన భక్తో తెలీదు గానీ కమల నాధులకి దగ్గర అవ్వడానికి ఉన్న ఏ ఒక అవకాశాన్ని వదులుకోవడం లేదు జగన్ మోహన్ రెడ్డి.


వ్యక్తిగత ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఇలా చెయ్యరు రాజకీయ కారణాలు భారీగా ఉండడం వల్లనే ఇలా జగన్ బీజేపీ కోసం ఎగబడుతున్నారు అని విశ్లేషకులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. కొవింద్ కి జగన్ కాళ్ళు మొక్కడం టీవీ చానల్స్ లో అక్కడా ఇక్కడా సోషల్ మీడియా లో కూడా హల్చల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: