మనుషుల మద్య అపోహలు..అనుమానాలతో క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తమ నిండు జీవితాలను బలిచేసుకుంటున్నారు. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బ్యుటీషియన్ శిరీష్, కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి జీవితాలే ఓ ఉదాహరణ. తనకు కావాలసిన వాడు దక్కలేదని ఆవేదనతో న్యాయం కోసం వెళ్లిన శిరీష అక్కడ అవమానం జరగడంతో..ఉరి వేసుకొని చనిపోయింది. శిరీషపై లైంగిక దాడి చేసిన తన విషయం బయటకు పొక్కడంతో కెరీర్ పై మచ్చవస్తుందని ఎస్సై తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు.
ఇలా క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో ఇద్దరు బలైనారు. తాజాగా ఇద్దరు ప్రేమ జంట మద్య వచ్చిన అపోహలతో ప్రియురాలు చనిపోవడంతో..ఆమె శవంతో ప్రియుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని బళ్లారిలోని సిరిగేరి గ్రామానికి చెందిన దావల్ సాబ్(24) అనే యువకుడు, చాకలి హనుమంతి(21) అనే యువతిని ప్రేమించాడు. వీరి మధ్య గత మూడేళ్ల నుంచి ఈ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరి పెళ్లి చేయడానికి ప్రియురాలి కుటుంబీకులు ససేమిరా అన్నారు.
వెంటనే దావల్కు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతమ్మ తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఇన్నాళ్లు తనను ప్రేమించి ఇప్పుడు వేరే యువతితో పెళ్లికి రెడీ అయిన దావల్పై నన్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో తాను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దూరం చేసుకుంటే తన పెళ్లికి లైన్ క్లీయర్ అవుతుందని భావించిన దావల్ సాబ్ ఆ యువతిని తీసుకొని బైక్పై గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ దావల్ ఆమెతో నీలో లోపం వుంది, నీకు వేరొకరితో సంబంధం ఉన్నట్లు నాకు తెలిసిందని..నువ్వు నా నుంచి విడిపోవడం మంచిదని సూచించాడు.
ఈ క్రమంలో వారిద్దరీ మధ్యలో కాసేపు వాగ్వాదం జరిగింది. తిరిగి బైక్ పై బయలు దేరిన హనుమంతి బైక్ దిగి ఇప్పుడే వస్తానని చెప్పి చెట్టు చాటుకు వెళ్లింది. ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన దావల్ సాబ్ అక్కడకు వెళ్లి చూడగా చెట్టుకు తన వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయింది. షాక్ కి గురైనా దావల్ సాబ్ ఏం ఆమె మృతదేహాన్ని కిందకు దింపి తన బైక్పై వేసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్కు తీసుకొచ్చాడు. విషయం అంతా వివరించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.