హైదరాబాద్ లో కలకం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్నట్లే ఆమెకు సన్నిహితంగా ఉన్న వారే  ఈ హత్య చేసి ఉంటారని చెబుతూ వచ్చారు.  హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి చాందినీ జైన్ ను దారుణంగా హత్యకు గురైన విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.  ఈనెల 9వ తేదీ శనివారం సాయంత్రం ఫ్రెండ్స్ ను కలిసేందుకు మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో ఉన్న ఇంటి నుంచి చాందినీ బయటకు వెళ్లిందని.. తర్వాత తిరిగి రాలేదని ఆమె కుటుంసభ్యులు చెప్పారు.  
Image result for student chandini murder
కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పోలీసుల నుంచి మియాపూర్ పోలీసులకు వచ్చిన కాల్ తో … చాందినీని దారుణంగా హత్య చేసి చంపారని పోలీసులకు తెలిసింది. పటాన్ చెరు దగ్గర్లోని అమీన్ పూర్ గుట్టలలో చాందిని డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. మిస్సింగ్ కేసు ఇపుడు మర్డర్ కేసుగా మారింది. మియాపూర్ స్టేషన్, సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిసి ఈ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

డెడ్ బాడీ పరిసరాలలో చాందినీ సెల్ పోన్, ఆమె బ్యాగ్, క్రెడిట్ కార్డు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.   దర్యాప్తు చేపట్టిన అధికారులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా షార్ట్ ధరించిన యువకుడితో కలిసి ఆమె ఆటోలో వెళ్లినట్టు బయటపడింది. దీంతో ఆమె స్నేహితులు పలువురిని విచారించిన పోలీసులు చివరికి చాందిని బాయ్‌ఫ్రెండ్ సాయికిరణే ఆమెను దారుణంగా హత్య చేసినట్టు తేలింది.  హత్యకు ముందు అత్యాచారం జరగలేదని చెప్పిన పోలీసులు మదీనాగూడలో నివాసముంటున్న సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  


తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తుండడంతో భరించలేని సాయికిరణ్ ముందస్తు పథకం ప్రకారమే ఆమెను గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: