ఏపీలో నంద్యాల ఉప ఎన్నికల తర్వాత విపక్ష వైసీపీ అధినేత జగన్కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ షాకుల పరంపరలోనే జగన్కు మరో దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. వైసీపీ బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో జగన్కు దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దశాబ్దంన్నర కాలంగా కీలకపాత్ర పోషిస్తూ వైఎస్ ఫ్యామిలీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఓ ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది.
ప్రకాశం జిల్లా దర్శి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న బూచేపల్లి ఫ్యామిలీ రాజకీయాల నుంచి వైదొలగనుంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ వస్తోన్న బూచేపల్లి ఫ్యామిలీ ఇకపై రాజకీయాలకు దూరం కానుందని టాక్. బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి 2004లో కాంగ్రెస్ టిక్కెట్ రాకపోయినా దర్శి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత 2009లో ఆయన కుమారుడు శివప్రసాద్రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన శివప్రసాద్రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్న సిద్ధా రాఘవరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బూచేపల్లి ఫ్యామిలీ దర్శి, చీమకుర్తి ప్రాంతాల్లో రాజకీయంగా చక్రం తిప్పుతూ వస్తోంది. శివప్రసాద్రెడ్డి తల్లి వెంకాయమ్మ చీమకుర్తి ఎంపీపీగా కూడా పని చేశారు.
ఇక బూచేపల్లి సుబ్బారెడ్డికి వయస్సు పై బడడం, వీరి సోదరుడు సినీహీరో కమలాకర్రెడ్డి అకాల మరణం చెందడంతో ఫ్యామిలీ వ్యవహారాలతో పాటు వ్యాపార బాధ్యతలు అన్ని శివప్రసాద్రెడ్డిపై పడ్డాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం బూచేపల్లి ఫ్యామిలీ జగన్ను కలిసి వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయమని ప్రత్యామ్నాయం చూడాలని చెప్పేసిందట. ఇక బూచేపల్లి ఫ్యామిలీ ఇలా చేయడానికి మరో కారణం కూడా ఉందన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.
జగన్ ఇటీవల తమ ఫ్యామిలీ విషయంలో అనుసరిస్తోన్న వైఖరితో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ బాగా ఖర్చుతో కూడుకుని ఉండడంతో బూచేపల్లి ఫ్యామిలీ రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా జిల్లా వైసీపీలో కీలకంగా వ్యవహరించడంతో పాటు జగన్ ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఉంటోన్న బూచేపల్లి ఫ్యామిలీ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జగన్కు మైండ్ బ్లాక్ లాంటి షాకే.