ఏపీ సీఎం చంద్రబాబును తన పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశారా ? తనపై కొన్ని విషయాల్లో ప్రెజర్ చేసినా .. తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించినా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని సరదు ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగారా ? అంటే అవుననే ఆన్సర్లే ఏపీ రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు ఎంత కాంట్రవర్సీ కింగో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మంత్రిగా ఉన్న మూడేళ్లలో ఆయనతో పాటు ఆయన కుమారుల తీరుపై ఎన్నో వివాదాలు వచ్చాయి. అయినా రావెల తీరు మాత్రం మారలేదు. తాజాగా మంత్రి పదవి పోయాక కూడా రావెల మళ్లీ కాంట్రవర్సీ వ్యవహారాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మంత్రి పదవి పోయాక ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఆ పార్టీ ఏపీ పగ్గాలు తనకు ఇవ్వాలన్న నివేదిక బాబు వద్దకు చేరింది. ఇక మందకృష్ణ మాదిగకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించడం, వైసీపీలో వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులతో చర్చలు జరపడం లాంటి వ్యవహారాలపై బాబు వద్ద ఇప్పటికే నివేదిక ఉంది.
ఇక తాజాగా మాదిగ రిజర్వేషన్ల అంశంపై రావెల గట్టిగా మాట్లాడుతున్నారు. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల చెపుతున్నారు. మందకృష్ణ మాదిగను సపోర్ట్ చేస్తుండడంతో పాటు గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో యాదవులను టార్గెట్ చేసేలా మాట్లాడారు. ఇక మాలలకు ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నాయని, ఈ విషయంలో మాదిగలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోన్న మందకృష్ణ మాదిగను పదే పదే తన ప్రత్తిపాడు నియోజకవర్గానికి పిలవడాన్ని కూడా టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల రావెల వ్యాఖ్యలకు మరో టీడీపీ నాయకుడు వర్ల రామయ్య గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వర్లతో పాటు పలువురు టీడీపీ నేతలు రావెలను టార్గెట్గా చేస్తున్నారు. దీంతో రావెల ఈ ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బాబుపై తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. తనపై టీడీపీ నేతలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని ఆయన హెచ్చరికలు చేస్తున్నారు.
రావెల ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అది బాబుకు పెద్ద తలనొప్పే. మళ్లీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేరు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లినా వెళ్లిపోవచ్చు. ఇక్కడ ఉప ఎన్నిక కూడా ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే రావెల బ్లాక్మెయిల్ వార్నింగ్లతో టీడీపీ నేతలను కామ్ అయిపోవాలని బాబు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి రావెల బ్లాక్మెయిల్ ఈ విషయంలో బాగా పనిచేసినట్లుంది.