ఈనాడు రామోజీరావు పెద్ద కొడుకు కిరణ్ సతీమణి శైలజా కిరణ్ కీ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి ఇద్దరి మధ్యనా మంచి సంబంధాలు ఉన్నాయి.

రెండు న్యూస్ పేపర్ ల కీ ఒక్క క్షణం కూడా పాడకపోయినా ఒకరి మీద ఒకరు గట్టిగా వ్యాఖ్యలు చేసుకుంటూ ఉన్నా స్నేహం విషయం లో మాత్రం వారు సన్నిహితులే.

ఈ విషయం గురించి ఒక ప్రముఖ మీడియా సంస్థ వారిని ప్రశ్నలు వెయ్యగా ఆమె అనేక విషయాలు చెప్పారు. ఈనాడుకు, సాక్షికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని... ఇలాంటి నేపథ్యంలో, భారతికి, మీకు మంచి స్నేహం కొనసాగుతోందని, ఇద్దరూ కలసి పార్టీలకు కూడా వెళుతుంటారని... ఇదెలా సాధ్యం? అని ఆ మీడియా హౌస్ వారు అడగగా ఆమెకి ఎవ్వరితోనూ వ్యక్తిగత బేదాభిప్రయాలు లేవు అన్నారు. 

'ఈనాడు'లో తమ ఛైర్మన్ రామోజీరావు దగ్గర నుంచి కింద స్థాయిలో పని చేసే ఉద్యోగి వరకు అందరం, అందరి పట్ల స్నేహ భావంతోనే మెలుగుతామని చెప్పారు. తమకు ఎవరి పట్ల శత్రుత్వం లేదని తెలిపారు. రాజకీయ అరంగేట్రం విషయం లో కూడా అప్పుడే అలాంటి ఆలోచన లేదు అన్నారు ఆమె. 


మరింత సమాచారం తెలుసుకోండి: