ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో సెకన్లలలో వైరల్ అవుతున్నాయి. తాజాగా గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   ఈ ఫోటోలను వైరల్ చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పటీదార్ ఉద్యమకారులు ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారు. గతంలో పటీదార్ ఉద్యమంలో పనిచేసిన రేష్మా మాత్రం ఇటీవల బీజేపీలో చేరారు. రేష్మా చెబుతున్నదాని ప్రకారం తనను దెబ్బతీయడానికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదని ఆరోపించారు. అశ్లీల చిత్రాలను సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ఆరోపించారు.

అశ్లీల చిత్రాలను పోస్టుచేసిన యువకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేష్మా గతంలో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చాలని సైబర్ క్రైమ్ అధికారులకు అదేశాలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలో  వైరల్ చేశారన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: