ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా శిష్యురాలు రఫియా నాజ్ కు ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. ఒక ముస్లింగా జన్మించి.. యోగా శిక్షణ ఎలా ఇస్తావంటూ మత సంస్థలు ఆమెను ప్రశ్నించాయి. యోగా ట్రయినింగ్‌ ఇవ్వడం తక్షణం ఆపాలని.. లేదంటే ప్రాణాలకు హాని తప్పదని సదరు సంస్థలు రఫియా నాజ్‌ను హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో, రఫియాకు జార్ఖండ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. ఈ హెచ్చరికలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ స్పందిస్తూ, రఫియాకు ఎలాంటి ఆపద కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు.రఫియా నాజ్‌కు ఆమె కుటుంబ సభ్యులకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాంచీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కుల్దీప్‌ ద్వివేదీ తెలిపారు.
Stop teaching Yoga - Sakshi
రఫియా నాజ్‌ పలు సందర్భాల్లో యోగా గురు రామ్‌దేవ్‌తో కలిసి వేదికను పంచుకున్నారు.రామ్ దేవ్ బాబాతో కలసి రఫియా పలు సందర్భాల్లో వేదికను పంచుకున్నారు. బాబాతోపాటు ఆమె కూడా యోగా మెళకువలు నేర్పేవారు


మరింత సమాచారం తెలుసుకోండి: