రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కి రాజ్యసభ సీట్ ఆఫర్ చేసింది ఆం ఆద్మీ పార్టీ. ఆయన కి ఓకే అంటే గనక తమ పార్టీ తరఫున పెద్దల సభ కి పంపిస్తాం అని పేర్కొన్నారు వారు. అయితే ఈ ఆఫర్ కి రఘురాం రాజన్ సున్నితంగా ఆన్సర్ ఇచ్చారు.

ఆప్ కి తన మీద ఉన్న ప్రేమకి సంతోషం అనీ అయితే తనకి ఇది ఇష్టం లేని వ్యవహారం అని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు సమాచారం.త్వరలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తమకు మూడు సీట్లు లభిస్తాయని, వాటిల్లో ఒకటి అంగీకరిస్తే, రాజన్ కు ఇస్తామని ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ యూనివర్శిటీ ఆఫ్ చికాగోకు ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి.

వర్శిటీ అధికారికంగా స్పందిస్తూ, రాజన్ ఇండియాలోనూ ఎన్నో విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారని, ఓ ప్రొఫెసర్ గా విద్యా బోధనా రంగంలో ఉండటమే ఆయన సంతోషకరమని, దాన్ని వదలాలన్న ఎటువంటి ఆలోచనలోనూ ఆయన లేరని స్పష్టం చేసింది.

రాజన్ ఒక మంచి సలహాదారు గా ఇప్పటికే పేరుగాంచారు అయితే ఆయన రాజ్యసభ లో ఉంటె మంచి సూచనలు ఇచ్చే పరిస్థితి ఉంది అని ఆప్ వాదన. 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడనున్నదని రాజన్ 2005లోనే అంచనా వేశాడు. ఆ విషయాన్ని అప్పట్లో ఆర్థికవేత్తల వార్షిక సమావేశంలో చెప్పాడు కూడా. మూడేళ్ళ తరవాత అది నిజంగా జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: