ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడిపికి ప్రతిపక్ష పార్టీ వైసీపి కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  ఆ మద్య నంద్యాల ఉప ఎన్నికల్లో టీడిపి బంపర్ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.  నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ వెళ్లారు.  ఆ సమయంలో జగన్ పై వ్యంగాస్త్రాలు, కాంట్రవర్సీ మాటలు అన్నారు. 

తాజాగా మరోసారి వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రపైనా వేణుమాధవ్ సెటైర్లు వేశాడు.  వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన వేణుమాధవ్, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  "చాలా కష్టపడుతున్నారన్నా పాపం... ఐదు రోజులు పాదయాత్ర చేస్తున్నారు.

మళ్లీ కోర్టుకు వెళ్లాలి, రావాలి... ఎంత ఇబ్బంది. ఇంత ఇబ్బంది పడుతున్న జగన్ ను చూస్తుంటే జాలేస్తోంది. వారి కష్టం ఎవరూ తీర్చలేనిది" అని వ్యాఖ్యానించాడు. వేణుమాధవ్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: