ఈ మద్య భారత దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతం అయ్యాయి.  ప్రభుత్వం నిర్భయ చట్టం అమల్లోకి తీసుకు వచ్చినా..కొంత మంది కామాంధులు ఇవేవీ లెక్క చేయకుండా దారుణాలకు వడిగడుతున్నారు.  తాజాగా ఓ యువకుడు లేడీ టెక్కీ, ఆమె కుటుంబ సభ్యుల మీద పెట్రలో పోసి నిప్పంటించిన దారుణ ఘటన చెన్నై నగరంలో జరిగింది.  వివరాల్లోకి వెళితే..చెన్నైలోని అందాబక్కంలో నివాసం ఉంటున్న ఇందుజా, ఆకాష్ అనే యువకుడు ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుకున్నారు. 
A girl killed in Chennai in the case of one side lover.
గతకొంత కాలంగా ఆకాష్ ఉద్యోగం వేటలో ఉండగా..ఇందుజ మాత్రం ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం సంపాదించింది.  అయితే తనను ప్రేమించాలని..పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా ఇందుజాను వేధిస్తు వచ్చాడు ఆకాష్. ఇందుజా మాత్రం నిన్ను ప్రేమించనని, పెద్దలు చూసిన సంబంధం చేసుకుంటానని ఆకాష్ కు గట్టిగా చెప్పింది.  దీంతో తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కొద్దని కక్ష్య మనసులో పెట్టుకున్న ఆకాష్ సోమవారం రాత్రి  అందాబాక్కంలోని ఇందుజా ఇంటి దగ్గరకు వెళ్లి తనను ప్రేమించాలని బయట గొడవ చేశాడు. 
A girl killed in Chennai in the case of one side lover.
ఇందుజా, ఆమె కుటుంబ సభ్యులు ఆకాష్ ని వెళ్లమని హెచ్చరించారు.  అయితే తాను ఒక్కసారి మాట్లాడి వెళ్తానని చెప్పడంతో తలుపుతు తీశారు..అంతే  ఆకాష్ క్యాన్ లో వెంట తీసుకెళ్లిన పెట్రోల్ ఇందుజా, ఆమె సోదరి నివేదిత, తల్లి రేణుక మీద పోసి నిప్పంటించి పరారైనాడు. 

వెంటనే స్పందించిన స్థానికులు ముగ్గురుని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్న క్రమంలో ఇందుజ మరణించింది. ఇందుజా సోదరుడు విదేశాల్లో ఉన్నాడని వారి బంధువులు చెప్పారు. ఇందుజా అన్న ఇంటిలో లేడని తెలుసుకున్న ఆకాష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: