ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా వైసీపీ నేత నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఏ చిన్న చాన్స్ వచ్చినా..అధికార పార్టీపై దుమ్మెత్తి పోసే రోజా తాజాగా జనసేన అధినేత పవన్కల్యాణ్పై విరుచుకుపడ్డారు. నిన్న పవన్ కళ్యాన్ విశాఖ పర్యటించిన విషయం తెలిసిందే. నిన్న జరిగిని సంఘీబావ సభలో పవన్ కళ్యాన్ తనదైనా స్టైల్లో ఏపీ లో అన్ని పార్టలకు, నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ నేత జగన్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు ఆమె. సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి లేకుంటే పవన్ ఎక్కడ వుండేవారని ప్రశ్నించారు. పవన్తో ఎవరు సినిమాలు చేస్తారు..? ఎవరు చూస్తారని మండిపడ్డారు. ఇప్పుడున్న మెగా హీరోలంతా.. చిరు కష్టాన్ని వాడుకుని పైకి వచ్చిన వాళ్లేనని ఒక్కమాటలో తేల్చేశారు.
వైఎస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్, ఆ తర్వాత జన హృదయాలను గెలుచుకున్నారని, పవన్ మాత్రం టైమ్ పాస్ రాజకీయాలు చేస్తూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని ఆరోపించారు.
ఇదిలా ఉంటా రోజా వ్యాఖ్యలపై మెగా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. మెగా హీరోల గురించి ఎందుకు ప్రస్తావించారని, మీడియాలో హైలైట్ కావాలనే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.