బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పటి వరుకు ఎంతో మంది ఉన్నారు. వారిలో శశికపూర్ ఒకరు..ఈ మద్య ఆయన కన్నుమూశారు. అయితే శశికపూర్ ని అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు..అందులో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒకరు. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడిన శశికపూర్ మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శశికపూర్ కుమార్తె సంజనాకపూర్ కి ఆమె లేఖ రాశారు.
శశికపూర్ నటించిన ఆంగ్ల చిత్రం ‘షేక్ స్పియర్ వాలా’ చూసి ఆయనకు అభిమానిగా మారానని, 1966లో ఇంగ్లాండ్ లో రాజీవ్ గాంధీ తనను ఈ సినిమాకు తీసుకువెళ్లారని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.
శశికపూర్ నటించిన పలు చిత్రాలు చూశానని, ఆయన గొప్పనటుడని, ఎలాంటి పాత్రల్లోనైనా గొప్పగా నటిస్తారని, కష్టపడి పని చేసే వ్యక్తి అని ఆమె ప్రశంసించారు. ఆ సినిమా చూడటం మర్చిపోలేని అనుభవంగా ఆమె అభివర్ణించారు. శశికపూర్ మృతి వార్త తెలిసి చాలా బాధపడ్డానని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.