కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ పదే పదే కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌కు మరోసారి భారత భద్రతా దళాలు బుద్ధి చెప్పాయి. సోమవారం రాత్రి నియంత్రణ రేఖను దాటి పీవోకేలో ప్రవేశించి కాల్పులు జరిపగా ఆ కాల్పుల్లో పాకిస్థాన్ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతిచెందారు. మరో పాకిస్థాన్ సైనికుడు కూడా గాయపడ్డట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పద్దతిలోనే తాజా ఆపరేషన్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోకి భారతీయ భద్రతా దళాలు ప్రవేశించాయి. 


భారత్ బలగాలు సోమవారం నియంత్రణ రేఖను దాటి, శనివారం ఎల్వోసీ వద్ద పకిస్తాన్ దళాలు జరిపిన కాల్పులకు ప్రతీకారం గా భారత భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. జమ్మూకశ్మీర్‌ లోని కేరీ సెక్టార్‌లో పాక్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్ప డింది.  అక్కడ భారత బలగాలు ఆ కాల్పులను తిప్పికొట్టాయి. దాంతో ముగ్గురు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గతఏడాది యూరీ దాడికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ దాడుల తరహాలో భారత ఆర్మీ ఎల్వోసీ దాటి పాక్ దళాలకు బుద్దిచెప్పాయి. 



ఎల్వోసీలోకి ప్రవేశించి పాక్ సైనికులను హతమార్చిన భారతీయ ఆర్మీ ఆ ఆపరేషన్‌ను 'లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ ఆపరేషన్‌' గా పేర్కొన్నది. స్థానికంగా ఆ ప్రాంతంలో ఉండే ఆర్మీ కమాండర్ ఆ ఆపరేషన్‌ను నిర్వహిస్తాడు. అధికారుల సమాచారం ప్రకారం సుమారు పది మంది ప్రత్యేక దళానికి చెందిన భారతీయ సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి కాల్పులు జరిపారు. 


సోమవారం పూంచ్ సెక్టార్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ కాల్పుల్లోనే ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందారు.రాజౌరి లో శనివారం పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిలో నలుగురు భారతీయ సైనికులు మృతిచెందారు. ఆ ఘటన కు ప్రతీకారంగా ఈ దాడులు చేశారు. అయితే ఈ ఆపరేషన్‌ను సర్జికల్ దాడిగా అధికారులు వర్ణించలేదు. కేవలం ఎంపిక చేసిన టార్గెట్‌ను మాత్రమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు చెప్పారు.


చాలా స్పష్టమైన లక్ష్యాలను ఈ ఆపరేషన్ ద్వారా ఛేదిస్తారు. అయితే రాత్రి నిర్వహించిన దాడిలో భారతీయ సైనికులు ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. భారత దళాలపై దాడి చేస్తే, ప్రతీకారం ఇలాగే ఉంటుందన్న సంకేతాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు.

ఎల్వోసీ దాటి పాక్ దళాలను హతమార్చిన భారతీయ ఆర్మీ

మరింత సమాచారం తెలుసుకోండి: