ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మహేష్ కత్తి  మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటికే పలుమార్లు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణ చేశాడు. తన ఉనికిని అందరికి తెలియజేసేందుకే కత్తి మహేష్ పదేపదే పవన్‌ను విమర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
Image result for pawan kalyan fatima college students
పవన్ కళ్యాన్   పాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని ఇటీవల విజయవాడ పర్యటన సందర్భంగా కోరారు. ఇదే అంశంపై ఆయన మరోమారు చంద్రబాబు సర్కారుకు మంగళవారం లేఖ కూడా రాశారు.  విద్యార్థులకు ఇప్పటికే నష్టం జరిగిందని, వారికి న్యాయం చేయాలని పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
Image result for pawan kalyan fatima college students
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈ రోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు" అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ కామెంట్స్ పోస్ట్ చేశాడు. మంగళవారం పవన్ పాతిమా కాలేజీ పైన చేసిన ట్వీట్ చంద్రబాబుతో పాటు మోడీ ప్రభుత్వాన్ని కూడా నిలదీసేలా ఉంది.
Image result for katti mahesh
విద్యార్థులు తమ విలువైన సంవత్సరాన్ని కోల్పోతుంటే ప్రభుత్వాలు తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించడంలో బిజీగా ఉన్నాయని చురకలు అంటించారు.తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు"అని తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశాడు. అయితే పోస్ట్‌పై పలువురు పవన్ అభిమానులు కత్తిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: