కుటుంబసభ్యులు, బంధువుల సందడితో పెళ్లి మండపం కళకళలాడుతోంది. అందరూ పెళ్లి సంబరాళ్లో ముగినితేలుతున్న సమయంలో ఒక్కసారే ధన్... మని శబ్ధం రావడం..పెళ్లి కొడుకు మృతి చెందడం..ఒక్కసారే పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... విక్రమ్ సింగ్ (36) స్విట్జర్లాండ్లో ఉండేవారు.. ఇటీవల ఆయనకు దగ్గరి బంధువైన అమ్మాయితో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఆదివారం రోజున గుల్హా టౌన్లోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది.
పెళ్లికి ముందు నిర్వహించిన ఓ కార్యక్రమం జాగోలో అంతా ఫుల్ జోష్గా డ్యాన్సులు వేస్తుంటే, మరో వైపు విక్రమ్ సోదరుడు సురేందర్ సింగ్ తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ తో గాల్లోకి కాల్చుతూ సంబరాన్ని చాటుకునన్నాడు. ఆ ఆనందంలో..గన్ అదుపు తప్పి బుల్లెట్లు నేరుగా పెళ్లికొడుకు, అతని స్నేహుతుడు నవ్ తేజ్ సింగ్ శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి.
విక్రమ్ జిత్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, నవ్ తేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితుడు, బాధితుడు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ కేసు కొంత సంక్లిష్టంగా మారిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయలేదని, త్వరలోనే నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మీడియాకు వివరించారు.