దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడదీ అంటే ఆటబొమ్మగా చూస్తున్న కొందరు మృగాళ్లు మహిళలు, యువతులు, చివరకు వృద్దులు, చిన్నారులను సైతం కామదృష్టితో చూస్తూ వారిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నిర్భయ చట్టం అమల్లోకి తీసుకు వచ్చినా..వీరిలో ఏమాత్ర భయం అనేదే లేకుండా పోయింది. నేరం చేసిన వాడు కొంత కాలం శిక్ష అనుభవించి..మళ్లీ బయటకు రావడం మళ్లీ మళ్లీ ఇలాంటి అకృత్యాలకు పాల్పపడటం కామన్ అయ్యింది.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చివరికి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్ స్నేహితులు మద్య సేవించి బూతు చిత్రాలు చూసి ఎవరినైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలని భావించారు.
అదే సమయానికి ఓ బాలిక అటువైపు గా వెళ్తుంటే..బలవంతంగా కిడ్నాప్ చేసి ముగ్గురు అత్యంత కృరంగా అత్యాచారం చేసి గాయపరిచారు. ఆ బాలికను సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని తాపీగా చెబుతున్నారు నింధితులు. బాలిక చనిపోయిన తర్వాత మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు.
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాతి రోజున నిందితులైన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకున్నారు.నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్కు తరలించారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.