కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్  కేసీఆర్ ల మధ్య జరిగిన భేట్టి మిధ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాపులను ఆకర్షించడానికి వీరిద్దరు ఈ విధంగా నాటకాలాడుతున్నారని వి.హనుమంతరావు విమర్శించారు.

అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ను ఈ ఉద్దేశంతోనే వాడుకుంటున్నారని ఈ సందర్భంగా వి.హనుమంతరావు తెలిపారు.  ఇటీవల ఓ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ వి.హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగటంలేదని, కేవలం రాష్ట్ర అభివృద్ధి అనే ముసుగులో అధికారం సంపాదించి డబ్బులు దండుకుంటున్నారు అని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వ తీరు జనానికి తెలిసిపోయిందని పనులేమి జరగడం లేదన్న వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకే పత్రికలు, టీవీల్లో భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. అవగాహన లేకుండానే కేసీఆర్ ను పవన్ కల్యాణ్ పొగుడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల విద్యుత్ ను అందించగలుగుతున్నారని చెప్పారు. నిజానికి కాపులలో పవన్ కళ్యాణ్ కంటే ముద్రగడ పద్మనాభం కు ఎక్కువ చరిష్మ ఉందని వీహెచ్ అన్నారు. పవన్ కల్యాణ్ తనకు చిరంజీవి తమ్ముడిగానే తెలుసని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: