కొంత కాలంగా హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాలు, వ్యభిచార ముఠాలు చెలరేగిపోతున్నాయి. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసిన అసాంఘిక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. గత డిసెంబరు మొదటి వారంలో బంజారా హిల్స్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు, ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ నటీమణులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మద్య స్పా ముసుగులో కొంతరు కేటు గాళ్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.
Related image
తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. ముఠా నిర్వాహకుడు, మరో యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.  గ్రామీణ బాలికలు, మహిళలను ఉద్యోగాల ఎరవేసి తమ వలలో వేసుకొని వ్యభిచార రొంపలోకి నెడుతున్నారు కొంత మంది దళారులు. 
Related image
అయితే ఇందుకు వ్యతిరేకంగా ఉన్న ఆడవారికి ఖడతేర్చడానికి కూడా వెనుకాముందు ఆడకపోవడంతో చాలా మంది భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు.  ఈజి మనీ కోసం బడా బాబులు సైతం హైటెక్ వ్యభిచారం నిర్వహించడం..అందుకు రాజకీయ, పోలీస్ ల పలుకుబడి కూడా ఉండటం వల్ల వారి కార్యకలాపాలకు అడ్డు లేకుండా పోతుంది.   
Image result for hyderabad hitech prostitution
కాగా,బంజారాహిల్స్‌లోని ఓ విల్లాలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు.  నిర్వాహకుడిని తమిళనాడుకు చెందిన అలెక్స్ (40)గా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో యువకుడు బీహార్‌కు చెందిన పంకజ్ కుమార్ మండల్ కాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ, యువతులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులను సంరక్షణ గృహానికి పంపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: