తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. తండ్రి తర్వాత నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు బాలకృష్ణ. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో తనదైన స్టైల్ చూపించి తండ్రికి తగ్గ తనయుడు అని మెప్పు పొందారు బాలయ్య. గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన బాలకృష్ణ చాలా కాలం తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించారు.
ఈ చిత్రం ఆయనకు వందవ చిత్రం కావడం విశేషం. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫుల్ లెన్త్ మాస్ ఎంట్ర టైన్ మెంట్ గా ‘పైసా వసూల్’ చిత్రంలో నటించారు. తాజాగా కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహ’ లో నటించారు. ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మంచి టాక్ వినిపిస్తుంది.
ఈ సందర్భంగా పలురువు సినీ ఇండస్ట్రీకి చెందినవారు బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా సంక్రాంతి సింహంగా నిలుస్తోందని నటుడు రాజీవ్ కనకాల, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు జగన్ పేర్కొన్నారు. జైసింహా సినిమాను శుక్రవారం గౌరి థియేటర్లో వారు సంయుక్తంగా తిలకించారు.
అనతంరం థియేటర్ ఆవరణలోనే అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు నటుడు రాజీవ్ కనకాల, జగన్పై పూల వర్షం కురిపించారు. సినిమాలో బాలకృష్ణ నటన, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు.