ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే ఫైర్ బ్రాండ్ అంటారు. ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పార్టీనీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు ని దుమ్ముదుళపడంలో ఈమె నెంబర్ వన్ అంటారు. అధికార పార్టీపై వైఎస్ జగన్ సందించిన అస్త్రం రోజా అని రాజకీయ విశ్లేషకులు అంటారు. ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే..బుల్లితెరపై వచ్చే ‘జబర్ధస్త్’ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు..నటి రోజా.
ఇక ఓ రాజకీయ నాయకురాలైనా..సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన నటి అయినా..తన పిల్లకు మాత్రం అమ్మ. అందుకే ఏ పండగ వచ్చినా..రోజా తన పిల్లలతో చాలా సరదాగా గడుపుతుంటారు. ఆ మద్య హోళీ సందర్భంగా తన కూతురు, కొడుకు తో తెగ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాచి.
ఇక సంక్రాంతి సందర్భంగా రోజా తన పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపారు..బిల్డింగ్పై పతంగులు ఎగరేసి ఎంజాయ్ చేశారు. పతంగులు ఇలా ఎగురవేయాలంటూ రోజా తన కుమారుడికి చూపించారు. పక్కనే ఆమె కుటుంబ సభ్యులు మరో గాలిపటాన్ని ఎగురవేశారు.
తాను పతంగి ఎగురవేస్తుండగా తీసిన వీడియోను రోజా తన యూ ట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలో సంక్రాంతి సందర్భంగా విభిన్న రంగులతో వింతైన ఆకారాలతో ఉన్న గాలిపటాలను ఎగరేస్తూ ప్రజలు ఆకాశమంత ఆనందాన్ని వ్యక్తం చేశారు.