కానీ చిత్రంగా ఈ రెండూ కూడా ఈ చీలిక పరిస్తితుల్లో చెరో వైపు బలంగా నిల్చోలేకపోవడం. సిపిఎం అధినేత రాఘవులు ఇంత వరకు ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు. చంద్రబాబులాగే ఆయనా మూతికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నారు. ఇక నారాయణ మరీ చిత్రం. ఆయన తెలంగాణా వచ్చిందని సంతోషపడడం లేదు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని, సీమాంధ్రులకు కూడా న్యాయం చేయాలని కొత్త మాటలు మాట్లాడుతున్నారు.
తెలంగాణా విడగొట్టాలని పదే పదే కోరినపుడు ఈ ఆలోచనలన్నీ ఏమయినట్లో? నిన్నటి దాకా అయితే కాంగ్రెస్ తో, లేకుంటే దేశంతో కలిసి పోటీ చేయడమే వీటికి తెలిసిన విద్య. మరి రాష్ట్రం చీలిపోతే, ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణాలో మార్కిస్టు పార్టీ కనిపించవా? తెలుగుదేశం పార్టీ చేరో రాష్ట్రంలొ చెరో పార్టీతో జతకడుతుందా? చూడాలి మరి.