విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా నాకు ప్రాణహాని ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు సంచలన కరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సాక్షాత్తు బీజేపీ హయాంలో నడుస్తున్న రాజస్తాన్ పోలీసులు తనను ఎన్ కౌంటర్  చేయడానికి ప్లాన్ చేసినట్లు ప్రవీణ్ తొగాడియా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తొగాడియా చేసిన ఆరోపణలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ప్రవీణ్ తోగాడియాను చంపాలి అనుకున్నది ఎవరు? అంత అవసరం ఎవరికి వచ్చింది? అంతకుముందు ఎవరికీ కనపడకుండా స్పృహతప్పి ఎవరికీ తెలియక రోజంతా  కనిపించని ప్రవీణ్ తొగాడియా. మంగళవారం మీడియా ముందుకు వచ్చి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన ప్రస్తుత పరిస్థితిని కన్నీటి పర్యంతం తో తెలియజెప్పడం జరిగింది. నన్ను శాశ్వతంగా భూమ్మీద లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నామీద ఎన్‌కౌంటర్‌ ప్లాన్  చేయడానికి రాజస్థాన్ పోలీసులు  పాత కేసులు తిరగతోడి తనను మట్టు పెట్టాలి అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రామమందిరం, గోవధ నిషేధ చట్టం, రైతుల సంక్షేమ పథకాలు తదితర అంశాలపై నేను పోరాడాను ఇందువల్లే నన్ను చంపాలనుకుంటున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

అసలు సరిగ్గా  తనపై దాడి ఎవరు చేస్తున్నారు చెప్పలేకపోయారు ప్రవీణ్ తొగాడియా, ఈ క్రమంలో మీడియా ప్రశ్నిస్తే సాక్షాధారాలతో సహా అసలు ఎవరు అనేది త్వరలో బయటపెడతానని ప్రవీణ్ తొగాడియా అన్నారు. మరోపక్క రాజస్థాన్ పోలీసులు మాత్రం ప్రవీణ్ తొగాడియా చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని తేల్చిపారేశారు. రక్తపోటుతో బాధపడుతున్న తొగాడియా తన కార్యాలయం నుంచి అదృశ్యమైన తర్వాత షాహిబాగ్ ఏరియాలో స్పృహలేని స్థితిలో కనిపించడంతో అదే ఏరియాలోని చంద్రమణి ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: