తెలుగు రాష్ట్రాలో రోజు రోజు కీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..ఈ ప్రమాదాల సంఖ్య మాత్రం అరికట్టలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగర శివారు వనస్థలిపురంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకెళ్లి ముందర వెళుతున్న ఓ బైక్తో పాటు మూడు ఆటోలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి, కొడుకు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి బైక్పై వెళుతుండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది. ఆటోల్లో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ శబ్దంతో ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.