పరిటాల రవి పవన్ కళ్యాణ్ గుండు కొట్టడం  కథ గురించి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అయితే తాజాగా అప్పట్లో పరిటాల రవి దగ్గర పనిచేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇటీవల ఓ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన వంశి  విలేకరి అడిగిన ఈ  ప్రశ్నకు వల్లభనేని వంశీ సమాధానమిస్తూ తనకు తెలిసిన విషయాన్ని చెప్పారు.

వంశి ఏం చెప్పారంటే “పవన్‌‌కు.. పరిటాల రవి గుండుకొట్టించారన్న మాటలన్నీ పచ్చి అబద్ధాలే. నాకు తెలిసీ పవన్‌కు పరిటాలకు అస్సలు పరిచయాలే లేవు. ఈ రూమర్స్‌పై అప్పట్లో రవన్న కూడా చాలా సార్లు ఖండించారు. ఈ మాటలు రవన్న పక్కనున్నోళ్లు ఎవరైనా మాట్లాడితే అలా మాట్లాడటం తప్పు.. వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి అని చెప్పేవారు” అని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ ఎవరి జోలికి వెళ్లే మనిషి కాదు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు అలాంటి ఆయనపై ప్రతిసారీ ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదని వంశీ స్పష్టం చేశారు. ఇటువంటి పుకార్లు ప్రతి పెద్ద హీరోల మీద సర్వసాధారణమని కానీ ఈ గుండు కథ ఇప్పటి వరకు కొనసాగడం నిజంగా ఆశ్చర్యమే అని అన్నారు వల్లభనేని వంశీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: