వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రకి మంచి రెస్పాన్స్ వస్తుంది రాష్ట్రంలో ఉన్న జనం బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరిని వయసు నిమిత్తం లేకుండా కలుసుకుంటూ వారి సంతోషాలలో పాలుపంచుకుంటూ వారి సమస్యలను ఓపిగ్గా వింటున్నారు జగన్.

దీన్ని గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ, జగన్ పాదయాత్రని కవర్ చేయకుండా తెలుగుదేశం ఆస్థానం మీడియా యెల్లో మీడియా లేనిపోని పిచ్చి డిబేట్స్  పెడుతూ రాష్ట్రంలో ప్రజల దృష్టిని మలుచుతుంది అని రాజకీయ మేథావులు అంటున్నారు. అయితే ఈ క్రమంలో జగన్ నిర్వహిస్తున్న ప్రతి సభలో ప్రజలకు అధికార పార్టీ టిడిపి  మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అర్థమవుతుంది.

అంతేకాకుండా జగన్ ప్రజలను చైతన్య పరుస్తూ ప్రసంగిస్తున్నారు. ఈసారి మోసపోవద్దని, అబద్ధాలు చెప్పే చంద్రబాబు ని నమ్మవద్దని ప్రజలకు చెప్పారు. ప్రస్తుతం పాదయాత్రను కేవలం సాక్షి మీడియా మాత్రమే ప్రసారం చేయడం మిగతా ఏ మీడియా చానళ్లు పట్టించుకోకపోవడం జగన్ పాదయాత్రకు మైనస్. కానీ పాదయాత్రకు మాత్రం జనం పోటెత్తుతున్నారు. అటు ప్రజల లో ఇటు పార్టీ క్యాడర్లో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర మంచి జోష్ నింపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: