గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.   ఈ మేరకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు అందాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఆనందీబెన్ పటేల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారని, ఈ రోజు నుంచే ఆమె గవర్నర్‌గా కొనసాగుతారని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.

మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత గుజరాత్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్‌ పని చేశారు. పటీదార్ల, దళితుల నిరసనల నేపథ్యంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆగస్టు, 2016 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె దిగిపోవడంతో గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ రుపానీ ఆ బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడంతో మరోసారి కూడా విజయ్‌ రుపానీ సీఎం బాధ్యతలు చేపట్టారు. 2002-2007 మధ్య కాలంలో మోదీ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా పని చేశారు. అయితే మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ పదవీకాలం ముగియడంతో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆనందీబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: