జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. గతేడాది అక్టోబర్ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. అయితే అజ్ఞాతవాసి మూవీ లేట్ కావడంతో ఆయన పొలిటికల్ యాత్ర లేటైంది. అయితే ఇప్పుడు ఆయన పూర్తిస్థాయిలో రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారు.


తన ఆరాధ్యదైవం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం చూస్తే..

“ మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి..

నా అప్రతిహత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభించబోతున్నాను. 2009 ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంబా బయటపడ్డాను. దానికి తోడు మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామే కావడం కూడా ఇక్కడ నుంచి నా నిరంతర రాజకీయ యాత్రను ఆరంభించడానికి కారణభూతమైంది. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులకోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను. నన్ను ఆశీర్వదించండి.. జైహింద్..”

Image result for janasena

... ఇదీ ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ ప్రకటన సారాంశం.. సో.. పవన్ త్వరలోనే రాజకీయం చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కొండగట్టు టూర్ ఎప్పుడనేది మాత్రం చెప్పకపోవడం అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: