తాము అధికారంలో ఉన్నాం,ఇంక తమకు ఎదురుచెప్పేదెవరు,ఎవరైనా ఎదురుతిరిగితే వాళ్లను ఎవరు కాపాడలేరు అనే రీతిలో టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. సామాన్య మానవుడి దగ్గరనుండి ప్రభుత్వ అధికారుల వరకు ప్రతిఒక్కరూ తెదేపా శ్రేణుల ఒత్తిడికి, ప్రలోభాలకు లోనవుతున్నారు. మొన్న కడప జిల్లా పులివెందుల నియోజక వర్గంలో జరిగిన జన్మభూమి సభలో ఏకంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చేతిలోనుండి టిడిపి కార్యకర్త మైక్ లాగేసుకోవడానికి ప్రయత్నించడం గురించి తెలిసిందే.


అయితే నిన్న రాత్రి చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఒక సంఘటన మరోసారి టిడిపి కార్యకర్తల అధికార గర్వాన్ని, రాష్ట్రంలో మహిళల రక్షణ ఎంతమాత్రం ఉందో తెలియజేసింది. టిడిపి కార్యకర్త, బిజెపి నేత భార్య చీరను లాగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరంలో ఉండే టిడిపి నేత ,వ్యాపారి అయిన హరిప్రసాద్ కు మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు అయిన గుత్త ప్రభాకర్ నాయుడుకు గత కొంతకాలం నుండి వ్యాపారంలో గొడవలు జరగుతున్నాయి. ఇక ప్రభాకర్ మాటల వల్ల వివాదం పరిష్కారం అవ్వదని లాయర్ ద్వారా హరిప్రసాద్ కు నోటీసులు  పంపించాడు.


తీవ్ర ఆగ్రహానికి లోనయిన హరిప్రసాద్ తన అనుచరుడు అయిన వెంకటకృష్ణమ నాయుడిని ఉసిగొల్పి ప్రభాకర్ ఇంటిమీదకి పంపించాడు. ఇంట్లొ ఉన్న భార్యను దుర్భాషలాడుతు చీర లాగాడని, అంతేకాకుండా భర్తను చంపేస్తానని బెదిరించాడని ప్రభాకర్ భార్య మీడియాకు వెల్లడించారు. వాగ్వాదంలో ఆమెకు గాయాలయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు త్వరలొనే ప్రారంభిస్తారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: